సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని ఏరియా హాస్పిటల్ లో నిర్వహించిన సమావేశంలో డి హెచ్ ఎం ఓ డాక్టర్ కోట చలం మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం తెలియజేశారు.గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో ఇటీవల జ్వరాలతో బాధపడుతున్న వారి రక్త నమోనా లను టీ హభ్ సూర్యాపేట ల్యాబ్ నందు పరీక్షించగా 17 మంది దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించి వారికి చికిత్స అందిస్తున్నారు.వారంతా కోలు కున్నట్లు సర్వారం గ్రామంలో పారిశుద్ధ్యం లోపించిందని సత్వరం చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కడ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.నీరు నిల్వ ప్రాంతాల్లో దోమలు ఆవాసాన్ని ఏర్పరచుకొని ఒక్కొక్క దోమ 3000 గుడ్లను పెడుతుందని తద్వారా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు సంభవిస్తాయని కావున ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు గ్రామ గ్రామాన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ,డ్రై డే, దోమల నిర్మూలన కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి అంజయ్య గౌడ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మ, ఇంది రాల రామకృష్ణ పాల్గొన్నారు..
-----------------------
Admin