సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరం అనిత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ శాసన సభ్యురాలు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి విచ్చేశారు. అనంతరం మహిళలు వేసిన ముగ్గులను తిలకించి ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని,అవి పూర్తిగా అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి 50 లక్షల మంది అప్లికేషన్స్ వచ్చాయి వాటిని కంప్యూటరైజుడు చేసి త్వరలోనే అర్హులైన అందరికి ఈ ఆరు గ్యారెంటీలను, హుజూర్ నగర్ నియోజకవర్గానికి మరియు కోదాడ నియోజకవర్గానికి వచ్చే విధంగా మేము బాధ్యతలు తీసుకుంటామని తెలియజేస్తూ, గత ప్రభుత్వం ప్రజలందరినీ భయభ్రాంతులను కల్పించిన గత విధానాలను పక్కన పెట్టేసి నూతనంగా ఒక డెమోక్రసీ అనే పాలన ఎలా ఉండాలి అనే ఏకైక ఉద్దేశంతో అందరికీ పాలన అందించాలని మేము ముందుకు వచ్చామన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
-----------------------
Admin