సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రానికి సమీపంలో కదిరి నుంచి బెంగళూరు ప్రధాని రహదారిపై ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి. ఓబులదేవర చెరువు మoడలం లోని జరికుంటపల్లి డాబాల వద్ద ఆదివారం సంఘటన జరిగిన .తనకల్లు మండలం మండ్లిపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ రెడ్డి ఆర్మీ జవానుగా బెంగళూరులో విధులు నిర్వహిస్తుండేవాడు. సెలవు నిమిత్తం నిన్నటి రోజున ఇంటికి వచ్చాడు. ఓబులదేవరచెరువు మండలం వేమారెడ్డి పల్లి నుండి పని నిమిత్తం ఓ డి సి వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నాడు. ప్రమాదంలో మృతి సోమశేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు సోమశేఖర్ రెడ్డి కు భార్య స్వర్ణ , ఇద్దరు కూతుర్లు అనూహ్య,కీర్తి, ఉన్నారు....
-----------------------
Admin