Sunday, 26 July 2026 01:04:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ....

Date : 09 December 2022 11:21 PM Views : 1004

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిపిఓ కార్యాలయం ముందు ధర్నా ..... సమస్యలతో కూడిన వివరాండాన్ని ఇవ్వడం జరిగింది. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డి వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ సభలో. సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి పాల్గొని మాట్లాడుతూ తపాలా శాఖ తెచ్చినటువంటి ఇన్సూరెన్సపాలసీ ఏదైతే ఉందో పది లక్షల రూపాయలు ఆ పాలసీ పంచాయతీ కార్మికులందరికీ అమలు చేయాలని ఆయన కోరారు. అలాగే పండగ మరియు ఆదివారం నాడు కార్మికులందరికీ సెలవు దినాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అనేక పంచాయతీలలో యూనిఫాం కొబ్బరినూనె చెప్పులు మాస్కులు బ్లౌజులు ఇంతవరకు ఇవ్వకుండా కార్మికులతో పని చేస్తున్నారని అవి వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు గతంలో ఆదివారం సెలవు దినాలను ప్రకటించాలని సిఐటియు చేసిన పోరాట ఫలితంగా సూర్యపేట జిల్లా డిపిఓ జీవోను రిలీజ్ చేసిందని దాని మిగతా అన్ని పంచాయతీల్లో అమలు చేయాలని ఆయన కోరారు అలాగే పంచాయతీలలో మల్టీపర్పస్ విధాన రద్దు చేయాలని కారోబార్ కు బిల్ కలెక్టర్ లకు పదోన్నతులు కల్పించాలని ఆయన తెలియజేశారు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సతీష్ మరియు జిల్లా నాయకులు మధు, నరసింహారావు, విజయ్,పోల్ సింగ్, నరేష్, బాదావత్ వీరన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :