సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణo కేంద్రంలో రోడ్డు భద్రత లో కదిరి ఆర్టీసీ డిపో ఉద్యోగుల పాత్ర అభినందనీయం రోడ్డు ప్రమాదాల నివారణలో ఆర్టీసీ డ్రైవర్లు,కండక్టర్లు,మెకానికల్ సిబ్బంది పాత్ర ముఖ్యమైనదని, ఈ విషయములో కదిరి డిపో ఉద్యోగులు అప్రమత్తతతో విధులను నిర్వర్తించి, ప్రమాదరహిత డిపో గా నిలబెట్టినారని కదిరి మోటారు తనిఖి అధికారి వరప్రసాద్ తెలిపారు. డ్రైవర్ అప్రమత్తంగా విధులను నిర్వర్తిస్తే..ప్రమాదములను నివారించవచ్చని తెలిపారు. ఈరోజు 44 వ రోడ్డు భద్రతావారోత్సవముల సందర్బముగా కదిరి డిపో గ్యారేజి నందు వారోత్సవసభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథులుగా కదిరి పట్టణ సర్కిల్ ఇన్-స్పెక్టర్ మధు, మోటారు తనిఖి అధికారి వరప్రసాద్ లు హాజరయ్యారు. సర్కిల్ ఇన్-స్పెక్టర్ మధు మాట్లాడుతూ కదిరి పట్టణములో డ్రైవర్ల నిర్ధేశించిన పాయింట్లలో బస్సులు ఆపాలని, పోలీసు వారికి సహకరించాలని కోరారు. సభకు అధ్యక్షత వహించినడిపో మేనేజరు బి.మైనోద్దీన్ మాట్లాడతూ డ్రైవర్లకు ప్రతి విషయములోను శిక్షణ ఇస్తున్నామని, మధ్యం తాగి, సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సులు నడప వద్దని డ్రైవర్లను కోరారు. ఉత్తమ సేవలందించి 32 సం..ములు పాటు ఎలాంటి ప్రమాదములు చేయని కుటాగుల్ల రామచంద్ర ను అర్బన్ సి.ఐ శాలువా,పూల బోకే తో సత్కరించారు. ఈ కార్యక్రమములో అసిస్టెంట్ మేనేజర్లు హరిమోహన్, హరిత, రామక్రిష్ణ, అసోషియేషన్ నాయకులు ఎన్.వి.రమణ, బైరిశెట్టి, యాకూబ్ ఖాన్, గంగరాజు, గోపాల్ నాయక్,మల్లికార్జున, రవి నాయక్ తదితరులు పాల్గోన్నారు...
-----------------------
Admin