Sunday, 26 July 2026 02:45:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కదిరి డిపో గ్యారేజి నందు 44 వ రోడ్డు భద్రతావారోత్సవములు...

Date : 29 January 2023 12:42 PM Views : 880

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణo కేంద్రంలో రోడ్డు భద్రత లో కదిరి ఆర్టీసీ డిపో ఉద్యోగుల పాత్ర అభినందనీయం రోడ్డు ప్రమాదాల నివారణలో ఆర్టీసీ డ్రైవర్లు,కండక్టర్లు,మెకానికల్ సిబ్బంది పాత్ర ముఖ్యమైనదని, ఈ విషయములో కదిరి డిపో ఉద్యోగులు అప్రమత్తతతో విధులను నిర్వర్తించి, ప్రమాదరహిత డిపో గా నిలబెట్టినారని కదిరి మోటారు తనిఖి అధికారి వరప్రసాద్ తెలిపారు. డ్రైవర్ అప్రమత్తంగా విధులను నిర్వర్తిస్తే..ప్రమాదములను నివారించవచ్చని తెలిపారు. ఈరోజు 44 వ రోడ్డు భద్రతావారోత్సవముల సందర్బముగా కదిరి డిపో గ్యారేజి నందు వారోత్సవసభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథులుగా కదిరి పట్టణ సర్కిల్ ఇన్-స్పెక్టర్ మధు, మోటారు తనిఖి అధికారి వరప్రసాద్ లు హాజరయ్యారు. సర్కిల్ ఇన్-స్పెక్టర్ మధు మాట్లాడుతూ కదిరి పట్టణములో డ్రైవర్ల నిర్ధేశించిన పాయింట్లలో బస్సులు ఆపాలని, పోలీసు వారికి సహకరించాలని కోరారు. సభకు అధ్యక్షత వహించినడిపో మేనేజరు బి.మైనోద్దీన్ మాట్లాడతూ డ్రైవర్లకు ప్రతి విషయములోను శిక్షణ ఇస్తున్నామని, మధ్యం తాగి, సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సులు నడప వద్దని డ్రైవర్లను కోరారు. ఉత్తమ సేవలందించి 32 సం..ములు పాటు ఎలాంటి ప్రమాదములు చేయని కుటాగుల్ల రామచంద్ర ను అర్బన్ సి.ఐ శాలువా,పూల బోకే తో సత్కరించారు. ఈ కార్యక్రమములో అసిస్టెంట్ మేనేజర్లు హరిమోహన్, హరిత, రామక్రిష్ణ, అసోషియేషన్ నాయకులు ఎన్.వి.రమణ, బైరిశెట్టి, యాకూబ్ ఖాన్, గంగరాజు, గోపాల్ నాయక్,మల్లికార్జున, రవి నాయక్ తదితరులు పాల్గోన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :