సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలోని గాజుల రాజ్యం లో 12వ తేదీ రాత్రి ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే కొత్తగూడెంలోని గాజుల రాజ్యం బస్తి లో నివాసం ఉంటున్న సొసైరాజు కుటుంబంతో కలిసి హైదరాబాదులోని తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కి వెళ్ళాడు. ఎప్పటినుంచో గమనిస్తున్న దొంగ వీడు లేని సమయం చూసి ఇంటికి తాళం వేయడంతో ఇంట్లోకి చొరపడ్డాడు. తలుపుకున్న తాళం పగలగొట్టి బీరువాలనుంచి సుమారు 8 తులాల బంగారం కొంత నగదు దొంగిలించాడని సొసైయ రాజు పెద్ద కుమారుడు పోలీసులకు తెలియజేశాడు. సిఐ సత్యనారాయణ ఎస్సై కాజా నజిముదిన్ దర్యాప్తు చేశారు. క్లూస్ టీమ్ వచ్చి ఫింగర్ ప్రింట్ ని సేకరించారు. దొంగ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు కట్టర్ సహాయంతో తలుపుకున్న తాళం భాగంలోని గడెను కట్ చేశాడు అని పోలీసులు వివరించారు. ఇంట్లో వాళ్ళు అందరూ లేకపోవడంతో ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-----------------------
Admin