సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణ పరిధి లోని శ్రీరామరక్ష సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆధ్వర్యంలో అధ్యక్షులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు నూతన నూతన వ్యక్తులను కార్యవర్గంలోకి ఆహ్వానించి నియామక పత్రాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు అండగా నిలుస్తుంది.ఇప్పటివరకు గ్రామాల్లో ఉన్న దేవాలయాలు డి డి యన్ పథకం కింద ఆలయ అర్చకుల భద్రత చూసుకున్న ప్రభుత్వం కొన్ని దేవాలయాలను మాత్రం విస్మరించింది. అటు దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఇటు డి డి యన్ కు సంబంధం లేకుండా గ్రామ కమిటీలు మరియు వంశ్య పారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాల పరిస్థితి వర్ణనాతీతం.సరిగ్గా జీతాలు రాక ఆలయాలకు భక్తుల కొరత కార్యక్రమ నిర్వహణకు నిధులు విరాళాలు అందక కొందరు అర్చకులు భగవంతుని సేవలకు దూరం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి.అలాగే నేడు ఉన్న ఆలయాల పరిస్థితి చూస్తే ఒక గ్రామంలో మూడు నాలుగు ఆలయాలు ఉండి అర్చకులు మాత్రం ఒక్కరో ఇద్దరో ఉండటం కొన్ని ఊర్లలో అర్చకులు కరువైన వైనం చోటు చేసుకుంది.ఇటువంటి తరుణంలో అన్ని గ్రామంలో ఉన్న ఆలయాలను ధూప దీప నైవేద్య పథకం కింద జేత చేసి ఆలయ అర్చకులను ఆదుకోవాలని కోరుతున్నాం.అదే విధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆలయ అర్చకుల తారతమ్యం లేకుండా ప్రభుత్వం గుర్తించి అందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలని తద్వారా అర్చకులకు అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం ఉంటుందని పేర్కొన్నారు.శ్రీరామరక్ష సోషల్ సర్వీసెస్ తెలంగాణ కార్యవర్గంలోకి నూతనంగా సభ్యులను ఆహ్వానించి బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో భట్టారం వంశీ కృష్ణ, గోమటం రాఘవా చార్యులు, మరింగంటి వరదా చార్యులు, చిలకమర్రి శ్రీనివాసా చార్యులు, చోడవరపు రమణ శర్మ నెల్లుట్ల వెంకట్ , చింతపట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin