సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ లో విశ్వశాంతి మహాయాగం, ఆయుత చండి యాగనికి భూమి పూజ కార్యక్రమం. ప్రజలు సుబిక్షంగా, ఆరోగ్యం గా, అనందంగా ఉండాలనే సంకల్పంతో అక్టోబర్ 26 నుండి నవంబర్ 8వ తేది వరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని మహబూబ్ నగర్ రోడ్డు శ్రీ సాయి బాలాజీ టౌన్ షిప్ ఎదురుగ పట్టణ ప్రముఖులు పలబట్ల చెన్న రాములు కి చెందిన భూమిలో మహాయాగం, ఆయుత చండి యాగం శ్రీకృష్ణ పిఠాదీపతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపనంద స్వామీజీ చేతులమీదుగా నిర్వహించబడును. ఈ సందర్బంగా ఈ రోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ యాగం ముఖ్య ఉద్దేశం అతివృష్టి, అనావృష్టి, వంటి దుర్భర పరిస్థితులు నెలకొనకుండా, భూకంపాలు, సునామి లాంటి విపత్తులు ఏర్పడకుండా, సూపరిపాలన, మహిళలకు రక్షణ కలగాలని, విద్యభివృద్ధి, మేధస్సు పెరిగి ప్రజలు సుబిక్షంగా ఉండాలని సంకల్పం తో ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు జరిగిన భూమి పూజ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ నరేందర్, పాలమూరు ట్రస్ట్ అధినేత బీజేపీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు, బీజేపీ షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య దంపతులు, టి యు డబ్ల్యూ జే ఐ జే యు రాష్ట్ర కార్యదర్శి గుడుపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీనన్న ), పలబట్ల మోహన్ రావు దంపతులు, కౌన్సెలర్ మామిడి శ్రీశైలం గౌడ్, జనసేన పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, ఋషికేష్, మురళి, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin