Sunday, 26 July 2026 08:12:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విశ్వశాంతి మహాయాగం... ఆయుత చండి యాగనికి భూమి పూజ...

Date : 25 September 2023 02:30 AM Views : 302

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ లో విశ్వశాంతి మహాయాగం, ఆయుత చండి యాగనికి భూమి పూజ కార్యక్రమం. ప్రజలు సుబిక్షంగా, ఆరోగ్యం గా, అనందంగా ఉండాలనే సంకల్పంతో అక్టోబర్ 26 నుండి నవంబర్ 8వ తేది వరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని మహబూబ్ నగర్ రోడ్డు శ్రీ సాయి బాలాజీ టౌన్ షిప్ ఎదురుగ పట్టణ ప్రముఖులు పలబట్ల చెన్న రాములు కి చెందిన భూమిలో మహాయాగం, ఆయుత చండి యాగం శ్రీకృష్ణ పిఠాదీపతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపనంద స్వామీజీ చేతులమీదుగా నిర్వహించబడును. ఈ సందర్బంగా ఈ రోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ యాగం ముఖ్య ఉద్దేశం అతివృష్టి, అనావృష్టి, వంటి దుర్భర పరిస్థితులు నెలకొనకుండా, భూకంపాలు, సునామి లాంటి విపత్తులు ఏర్పడకుండా, సూపరిపాలన, మహిళలకు రక్షణ కలగాలని, విద్యభివృద్ధి, మేధస్సు పెరిగి ప్రజలు సుబిక్షంగా ఉండాలని సంకల్పం తో ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు జరిగిన భూమి పూజ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ నరేందర్, పాలమూరు ట్రస్ట్ అధినేత బీజేపీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు, బీజేపీ షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య దంపతులు, టి యు డబ్ల్యూ జే ఐ జే యు రాష్ట్ర కార్యదర్శి గుడుపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీనన్న ), పలబట్ల మోహన్ రావు దంపతులు, కౌన్సెలర్ మామిడి శ్రీశైలం గౌడ్, జనసేన పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, ఋషికేష్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :