సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహూల్ హెగ్డే ఐపిఎస్ అన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 8 పిర్యాదు వచ్చినాయి, వివిధ సమస్యల పై బాధితుల నుండి వచ్చిన అర్జిలను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజావాణి లో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ ల అధికారులతో మాట్లాడుతూ పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. పౌరులు చట్టానికి లోబడి నడుచుకోవాలి, చట్ట ఉల్లంగణ చర్యలకు పాల్పడిన, ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవ్వరూ కూడా గొడవలు పెట్టుకోవద్దు, గ్రామాల్లో అసత్య సమాచారం ప్రచారం చేయవద్దు, సోషల్ మీడియా నందు అనుచిత వాక్యలు చేయవద్దు అన్నారు.ఎస్పి వెంట అదనపు ఎస్పీ నాగేశ్వర రావు ఉన్నారు.
-----------------------
Admin