సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గత 20 రోజులుగా నర్సంపేట డివిజన్ అంబుజా, ఎసిసి, సురక్ష సిమెంట్ నర్సంపేట డివిజన్ డీలర్ల వద్ద పనిచేయుచున్న హమాలీ కార్మికులకు,యజమానులకు మధ్య పని విధానంలో వచ్చిన సమన్వయ లోపం కారణంగా గత కొన్ని సంవత్సరములుగా పనిచేయుచున్న హమాలీ కార్మికులను వద్దని నూతనంగా డీలర్ షిప్ తీసుకున్న సాగర్ రెడ్డి గారు బీహార్ లేబర్ తో పని చేయించుకుంటానని ఆలోచన ఉన్నందున మా హమాలీ పనులను మేమే చేసుకుంటామని గత 20 రోజులుగా హమాలీ కార్మికులు ఏఐఎఫ్టియు (న్యూ) అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేయగా ఈరోజు కార్మిక సంఘ నాయకులు, కార్మికులు మరియు డివిజన్ డీలర్ సాగర్ రెడ్డి గారు. గోదం యజమాని చంద్రశేఖర్ సేటు గారు, మరియు మోతే జైపాల్ రెడ్డి గారల సమక్షంలో పని విధానం గురించి చర్చలు జరిగి గత కొన్ని సంవత్సరములుగా సిమెంట్ డీలర్ వద్ద పనిచేయుచున్న హమాలీ కార్మికులు యధావిధిగా గతం నుండి పనిచేసిన హమాలీ కార్మికులే పనులు చేయాలని, డీలర్ షిప్ యజమానికి పనులకు ఎలాంటి ఆటంకం జరగకుండా హామాలి కార్మికులు పనులు చేయాలని ఒప్పందం చేసుకోవడం జరిగినది.నర్సంపేట డీలర్ సాగర్ రెడ్డి గారికి హమాలీ కార్మిక సంఘం ఏఐఎఫ్టియు (న్యూ) హమాలీ కార్మికులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.ఈ చర్చలలో కార్మిక సంఘం ఏఐఎఫ్టీయూ (న్యూ) రాష్ట్ర అధ్యక్షులు మోడెమ్ మల్లేశం, హమాలీ ముఠా పెద్దమనిషి సంఘం పట్టణ కార్యదర్శి మెరుగు జనార్ధన్, సిమెంట్ నర్సంపేట డివిజన్ డీలర్ సాగర్ రెడ్డి, గోదాం యజమాని చంద్రశేఖర్ సెట్, మోతే జైపాల్ రెడ్డి గారు మరియు హమాలీ కార్మికులు ఇప్ప బాబు, ఐలయ్య కుమారస్వామి, రమేష్, రణధీర్, మధు, కడారి సదయ్య, ఆరేల్లి యాకయ్య, జెట్టిగట్టయ్య, వాసం యాకన్న, పులుసం శ్రావణ్, నాలం సతీష్, తోగరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter