సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో భక్తుల కొంగుబంగారంగా వెలసిన శ్రీ శ్రీ శ్రీ గుంటిరంగస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ గాసం శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గాసం శ్రీనివాసులు మాట్లాడుతూ.... గురువారం రోజున స్వామివారిని గ్రామ పురవీధుల గుండా బాజా భజంత్రీలతో, భజన కీర్తనలతో ఊరేగింపు చేసి స్వామివారి దేవాలయానికి చేరుకొని సాయంత్రం 5:00 గంటల సమయంలో ప్రభోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. శుక్రవారం రోజున ఉదయం పంచామృత అభిషేకం అనంతరం స్వామివారి కల్యాణం జరుపబడును. సాయంత్రం 5:00 గంటల సమయంలో రథోత్సవం కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. శనివారం రోజున సాయంత్రం 5:00 గంటల సమయంలో పాలవుట్ల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తదితర కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం తదితర వసతి కల్పించామన్నారు. అలాగే 03 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గాసం శ్రీనివాసులు తెలిపారు.
-----------------------
Admin