సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు : మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన సమర యోధులను స్మరించుకుంటూ జీవితంలోని ప్రతీ రోజు ,ప్రతి క్షణం, శరీరంలోని ప్రతి అణువు మాతృభూమి కోసం జీవించడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళి గ్రామ సర్పంచ్ శివశంకర్ రెడ్డి సి ఎల్ ఆర్ సి శారద సాంకేతిక సహాయకులు రాజారెడ్డి ఏపీ డి సహాయకులు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు.ఓబులదేవర చెరువు మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీ నారప్పగారిపల్లి గ్రామంలో నాదేశం_నామట్టి నేల తల్లికి నమస్కారం, వీరులకు వందనం వేడుకలను సోమవారం ప్రారంభించారు వారు మాట్లాడుతూఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం కృషి చేసిన మహానుభావులు, స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకునేందుకు ఈ ఆజాదీకా అమృత మహోత్సవ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము.పిడికిలి మట్టి లేదా మట్టి దీపంతో పంచ్ ప్రాణ్ ప్రతిష్ట చేసి 75 చెట్లతో అమృత వాటికను సృష్టించాలి, దేశంలో ఉన్న వీరులను, స్వాతంత్ర్య సమరయోధులను, వారి కుటుంబాలను గౌరవించుకుంటా. జాతీయ జెండాను ఆవిష్కరించారు . గ్రామాల నుండి సేకరించే మట్టిని ఢిల్లీ కి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో ముగింపుఉత్సవాల్లో మట్టిని చేరుస్తారన్నారు. ఈ ఉత్సవాల్లో మన పంచాయతీ నుండి యువత మహిళలు పెద్దఎత్తునపాల్గొన్నారు.నారప్ప గారి పల్లి ప్రాధమిక పాఠశాల కేంద్రం లో ఆవరణలో మొక్కలు నాటారు.కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాసులు నాయకులు చెన్నారెడ్డి, రమణ ,వరదారెడ్డి, నంజిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది అగ్రికల్చర్ అసిస్టెంట్ సుధాకర్, దిలీప్, నరేంద్ర ,రామచంద్ర, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వాలంటీర్లు , వెలుగు సిబ్బంది , మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin