సర్కార్ టీవీ న్యూస్ / కోహెడ జిల్లా : హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ కొహెడా జిల్లా పరిషత్ పాఠశాలలో దాతలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గుర్తుతెలి యని దుండగులు ఆదివారం రాత్రి అపహరించుకుపోయారు. సాయంత్రం వేళల్లో తాగుబోతులు పాఠశాల ఆట స్థలంలోనికి వచ్చి మద్యం సేవిస్తున్నారని, ఖాలీ సిసాలు అందులో వేస్తున్నారని స్థానిక ఉపాధ్యాయులు గ్రామస్తులకు ఫిర్యాదు చేయడంతో ఓ దాత ముందుకు వచ్చి ఖరీదైన 16 సీసీ కెమెరాలను పాఠశాల చుట్టు, లోపల ఏర్పాటు చేయించాడు. పవర్ లేకున్నా పని చేసే ఖరీదైన కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు పాఠశాల బయట ఉన్న 7 కెమెరాలను అపహరించు కుపోయారు.సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యా యుడు దన్నే రాజు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి హయత్ నగర్ పోలీసు లకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాఠశాలకు చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు...
-----------------------
Admin