సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలో గోవిందపురం లో గల వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న స్థలం గత వంద సంవత్సరాలు నుండి ఇట్టి మల్లరామయ్య సన్నాఫ్ కోటయ్య పూర్వికుల నుండి ప్రస్తుత వీరి వారసులు ఇట్టి మల్ల వెంకటేశ్వర్లు, జానకి రాములు ,రామకృష్ణ వారు స్వాధీన నా అనుభవ కబ్జాలో ఉన్న పెంట దిబ్బలు స్థలాలను సుమారు మూడు గంటల భూమిలో మున్సిపాలిటీ వారు కబ్జాదారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సంబంధిత శాఖ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కమ్యూనిటీ హాల్ ను ఏకపక్షంగా నిర్మాణం గావించుటకు పనులు మొదలు పెట్టినారు పూర్వం నుండి కబ్జాలో ఉన్నవారు ఇట్టి విషయాన్ని ఉన్నతాధికారులకు అర్జి చేసుకుని తమ స్థలాన్ని తమకు ఇప్పించమని కోరినారు. వందేళ్ళ నుండి తమ ఆధీనంలో ఉన్న ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణం చేసి తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
-----------------------
Admin