సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలోని సోమవారం ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ నందు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మెప్మా సంస్థ మంజూరు చేసిన స్వయం సహాయక సంఘం దుర్గా దేవి క్యాంటీన్ ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి .. మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ నాయకులు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలిచిన వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రారంభించారు అని అన్నారు..మహిళలు తమసొంతవ్యాపారాలనుప్రారంభించేందుకు మరియు ఆర్థికంగా స్వతంత్రంగా మారడానికి ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అని అన్నారు. ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళ ల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు అని అన్నారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దిరావత్ స్కైలాబ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలు మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ మిర్యాలగూడ పట్టణ కౌన్సిలర్లు కార్యకర్తలు ఇంద్ర శక్తి క్యాంటీన్ సభ్యులు పాల్గొన్నారు...
-----------------------
Admin