సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం డబురు వారి పల్లి పంచాయతీ పరిధిలోని కుసుమ వారి పల్లి దగ్గర జరుగుతున్న అమృత సరోవర్ పనులను ఎంపీడీవో పోలప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ జూన్ మొదటి వారంలో సెంట్రల్ టీం సభ్యులు అమృత్ సరోవర పనులను పరిశీలిస్తారని తెలిపారు. ఈ చెరువు కట్టపైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని క్షేత్ర సహాయ సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి సిబ్బంది ఒక టీం గా పనిచేసి ఈ పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబాలకు పని కల్పించాలన్నారు .అలా కల్పించిన వారిపై చర్యలు తక్షణమే తీసుకుంటామని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కూలీలతో ఎంపీడీవో మాట్లాడుతూ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వారం వారం మీరు పని చేసిన వాటికి పే స్లిప్పులు ఇస్తున్నారని అడగగా మాకు వారం వారం డబ్బులు పడుతున్నాయని చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు .మీకేమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో కూలీలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సోమశేఖర్ రెడ్డి ,ఈసీ అంజనేయులు, సాంకేతిక సహాయకులు చంద్రారెడ్డి ,రాజేంద్ర ,రాజారెడ్డి క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు
-----------------------
Admin