సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: బిజెపి కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశం లో బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఆకుల నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే మన బ్రతుకులు బాగుపడతాయని ఎన్నో త్యాగాలను చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు గడీల పాలనయింది. తెలంగాణలో మెజార్టీ పీపులైన బీసీలకు కనీసం 50% బి ఆర్ సి పార్టీ ఇయ్యకుండా బీసీలకు 23 సీట్లు ఇచ్చి, 10 శాతం ఉన్న అగ్ర కులాలకు 50% సీట్లు ఇచ్చి 60 శాతం ఉన్న బీసీలకు 20 శాతం టికెట్లు ఇచ్చి దగా చేసిన కేసీఆర్ ఈనాడు తెలంగాణలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు. మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారం ఫలాలు దక్కకుండా ఒకటి రెండు శాతం ఉన్న వర్గాలకు రాజ్యాధికార ఫలాలు ఈ తొమ్మిది ఏళ్లలో వారికే దక్కాయి. ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నాము త్యాగం చేసిన బీసీ .ఎస్సీ .ఎస్టీ వర్గాలను తుంగలో తొక్కి మళ్ళీ మూడోసారి రావాలనే ప్రయత్నం బీసీలు గుర్తించి నిన్ను ఓటు బ్యాంకు ద్వారా ఇంటికి పంపడం ఖాయం. ఏ వర్గాలకు న్యాయం చేయకపోగా పథకాలతో , గా రడీలతో ఓటు వేయించుకోవాలని చూస్తున్న ఈ ప్రభుత్వం నమ్మే పరిస్థితిలో బీసీలు లేరని, ఈనాడు తెలంగాణలో బిజెపి పార్టీ ద్వారా బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని, నరేంద్ర మోడీ గారు సారథ్యంలో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీసీలను అగ్ర తాంబూలం ఇచ్చి బిజెపి పార్టీ లో మోడీ గారి ప్రధానమంత్రి అయ్యారని రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పతనం కాయం. బీసీ బందు అన్ని వర్గాలకు కేటాయించాలని డిమాండ్ రానున్న రోజుల్లో బీసీలు మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియపరిచారు.అట్టడుగు వర్గాలను మోసం చేసి తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో obc జిల్లా ప్రధాన కార్యదర్శి కేసు గాని శ్రీనివాస్ గౌడ్, భూపతి అప్పారావు, టీ. నరేంద్రబాబు,జలారపు శ్రీనివాస్, ఉబ్బనపల్లి వినీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin