సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పిల్లుట్ల రఘు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తుతో పోటీ చేస్తున్నారు.నియోజవర్గ వ్యాప్తంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజవర్గంలో పాదయాత్రతో గడప గడపకు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకొని,అధికారంలోకి రాగానే నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.తన మేనిఫెస్టోలో ఉన్నవి కూడా అధికారంలోకి రాగానే తూచా తప్పకుండా అమలు చేస్తానని తెలిపారు.ముందుగా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ర్యాలీతో బయలుదేరి గోపాలపురం ఆంజనేయ స్వామి జాన్ పహాడ్ సైదన్న దీవెనలు తీసుకొని, ప్రజల ఆశీర్వాదంతో తన ప్రచార రథాలతో బయలు దేరినారు ర్యాలీలో భాగంగా ముత్యాల నగర్ గ్రామస్తులు ట్రాక్టర్,బైకులు మీద వచ్చి పిల్లుట్ల రఘున్న ను కలిసి తనపై ఉన్న అభిమానంతో వచ్చామని ప్రజా సేవ, ప్రజల పక్షాన నిలబడే నాయకుడే తమకు కావాలని సింహం గుర్తుకు ఓటు వేసి రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపిస్తామని హామీ ఇచ్చారు.తరువాత గరిడేపల్లి, నేరేడుచర్ల ,పాలకీడు మండలాల్లో తో పాటు అనేక ఊర్లలో గ్రామాల్లో తన ప్రచార రథాలతో ప్రయాణిస్తూ,ప్రజలతో మమేకమవుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ర్యాలీని కొనసాగించారు. ర్యాలీలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పిల్లుట్ల రఘు మాట్లాడుతూ ప్రజలు వేసిన ఓట్లతో కొంతమంది ధనార్జన ద్వేయంగా పార్టీలు మారి కండువాలు కప్పుకుంటున్నారని, వారు పార్టీలు మారితే,ప్రజలు మారినట్లా ప్రజలు కూడా ఆలోచించి అవినీతి చేసి ప్రజలను మోసం చేసే నాయకులను నమ్మవద్దని తెలిపారు.ప్రజలు పార్టీలను కాకుండా తనలా ప్రజాసేవ చేసే నాయకుడికి ఒక అవకాశం ఇచ్చి చూడాలని, మార్పు అంటే ఏంటో చూపిస్తాను అని అన్నారు. అధికారం లో ఉంటే ఇంకా ప్రజలకు మంచి పనులు, సేవలు చేస్తానని తెలిపారు.సింగిల్ గా సింహం గుర్తుతో వచ్చి పార్టీలను బొంద పెడతానని తెలిపారు.అలుపెరుగని ప్రజాసేవే లక్ష్యంగా సింహం గుర్తుతో మీ ముందుకు వస్తున్న ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే తాను చేసి అభివృద్ధిలో రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలుపుతాను అని పిల్లుట్ల రఘు అన్నారు.
-----------------------
Admin