సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ హాల్ నందు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నవంబర్ ఏడో తారీఖున హైదరాబాదులో జరగబోయే మాదిగల విశ్వరూవ మహాసభను విజయవంతం చేయడానికి. మాదిగల గడప గడప కి కరపత్రం చేరాలనే ఎజెండాతో ఈ కరపత్రాన్ని విడుదల చేశారు . బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏబిసిడి వర్గీకరణ చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పటికీ అధికారం లోకి వచ్చి 9 సంవత్సరాలు దాటినా గాని ఇంకా వర్గీకరణ అనేది చేయక అందుకని మాదిగల అందరూ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేయాలని నేపథ్యంలో మాదిగల విశ్వరూపం మహా సభ ను మనమందరం కలిసి హైదరాబాదులో చేసుకోవడం జరుగుతున్నదని ఈ కార్యక్రమంలో అవిరేని మహేష్ హుజూర్ నగర్ మండల ప్రధాన కార్యదర్శి మాదిగ, మాదాసి శశి మాదిగ, కష్టాల యాకోబు మాదిగ, బుట్ట వంశీ మాదిగ, లక్కీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin