సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి నేరేడుచెర్ల మండలం లోని చిల్లేపల్లి సిటీ సెంట్రల్ స్కూల్ అద్దె భవనం లో పాలక వీడు మండలం గుడుగుండ్లపాలెం బి సి బాలికల గురుకుల పాఠశాల ప్రారంభించారు. ఈ సందర్బంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ బి సి గురుకుల బాలికల పాఠశాలను త్వరలో 3 కోట్లతో గుడుగుండ్లపాలెం లో నిర్మించబోతున్నట్టు తెలియజేశారు. బి సి గురుకులాల అన్ని పనులు ప్రస్తుతం చిల్లేపల్లి కేంద్రంగానే కొనసాగుతాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,గురుకుల పాఠశాల అధికారులు,పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin