సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేస్తున్న అతిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని... బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపాలిటీలోని 1వ వార్డులో ఆయన పర్యటించి శిలాఫలకం లేకుండా శంకుస్థాపన చేసిన దిమ్మెకు దండా వేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎమ్మెల్యే వనమా వ్యవహార శైలిని చూస్తుంటే ఆయనకు మతి భ్రమించినట్లు ఉందని అన్నారు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్పుకునే ఆయన ఎన్ని కోట్ల నిధులతో ఏమేం పనులు జరుగుతున్నాయో శిలాఫలకంలో పొందుపరచాల్సి ఉందని,ఇలా ఏ విధమైన సమాచారం లేకుండా నాలుగు రాళ్లతో దిమ్మెను కట్టి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేయడం ఏంటని ప్రశ్నించారు? కొత్తగూడెంలో జరిగే ప్రతి అభివృద్ధి పనికి శిలాఫలకంలో కచ్చితంగా అందుకు తగ్గ సమాచారం ఉండాలని సూచించారు.ఇవేమీ లేకుండానే తూతూ మంత్రంగా శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆక్షేపించారు.ఇలాంటి జిమ్మిక్కులను చూసి నమ్మి ఓట్లు వేసే రోజులు పోయాయన్నారు.నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి పనుల తాలూకు వివరాలను ఆయా ప్రాంతాలలో శిలాఫలకంలో పొందుపరచాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే వనమా నియోజకవర్గాన్ని తన జాగీర్ అనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటినుంచి ఎన్నికలు జరిగే వరకు ఎమ్మెల్యే వనమాను విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు.జరిగే ప్రతి అభివృద్ధి పనులు తాలూకు వివరాలను తెలుసుకొని పోరాటాలు చేస్తామని,తూతూ మంత్రంగా ప్రజలను మభ్య పెట్టేందుకు శంకుస్థాపనలు చేస్తూ డబ్బులు దండుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,చెనిగారపు నిరంజన్ కుమార్,పట్టణ అధ్యక్షుడు వంగా రవిశంకర్,సిద్దంకి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin