సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫారూఖ్ నగర్ మండల్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కారించుకొని బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో ఎమ్ఈవో శంకర్ రాథోడ్ అధ్యక్షతన మండలస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా 40 మందికి, జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 10 మందికి వారిలో దుస్కల్ గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సర్ఫరాజ్ అహ్మద్ ను స్థానిక శాసన సభ్యులు అంజయ యాదవ్ చేతులమీదుగా ఘనంగా సన్మానం చేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల భవిత బంగారుమయం చేయగల శక్తి ఉపాధ్యాయులకేవుందన్నారు.విద్యార్థులను కన్నబిడ్డలవలె చూసుకుంటు చదువుసంధ్యలతో పాటు ఆటపాటలు కూడా నేటితరం ఉపాధ్యాయులు నేర్పుతున్నారని, అందుకు వారు అభినందనీయులని కొనియాడారు. రేపటితరం బాగుపడాలంటె తరగతిగదిలో అందుకు తగిన కృషి జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఖాజా ఇద్రీస్ అహ్మద్, ఎంపిడివో డాక్టర్. వినయ్ కుమార్, జడ్పిటిసి వెంకట్రామ్ రెడ్డి, మండల విద్యాధికారి శంకర్ రాథోడ్, రామకృష్ణ, ఎంపీటీసీ, నారయణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు బి. కృష్ణయ్య, సురేష్ సింగ్, జేసీ.వేంకటయ్య, వేంకట్ రెడ్డి, థావుర్య, జిల్లా బాధ్యులు వేంకటప్ప, విద్యాభిమానులు పాల్గొన్నారు.
-----------------------
Admin