సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండల పరిధిలో గల కర్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 తారీకున మహారాష్ట్రలోని మౌ అనే గ్రామంలో తండ్రీ రామ్ జీ సాక్వాల్, తల్లీ భీమాబాయి దంపతులకు 14 వ సంతానంగా జన్మించారు. అంబేడ్కర్ చిన్న వయస్సులోనే ఊరికి , బడికి, గుడికి, నీళ్లకి, చదువుకు దూరం చేసిన పట్టువధలకుందా పెద్ద చదువులు చదివి దేశానికి న్యాయ శాఖ మంత్రి చేపట్టి కాంగ్రెస్ పద్ధతులు దేశ ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చట్లేదని న్యాయ శాఖ మంత్రి పదవిని వదిలిన గొప్ప వ్యక్తనీ కొనియాడారు. ఆయన అప్పటి మత, కుల, లింగ వివక్షతలు లేకుండా స్వతంత్ర భారత దేశంలో అందరికీ కూడ ఓటు హక్కుతో సమానంగా జీవించడానికి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని కష్టపడి రాశాడని దాని వలన దేశంలో కొంత మంది లాభం పడ్డారు కానీ చాలా మంది నిరుపేదలుగా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అక్రమ్, ఎంపీటీసీ చిన్న రంగప్ప, ఉపసర్పంచ్ కృష్ణయ్య గౌడ్, అంగన్వాడి టీచర్ దామొల్ల యశోద , విజయ భాస్కర్ రెడ్డి, VRA ఆంజనేయులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin