సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ పట్టణం లో "డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ"బలిదాన్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందారని. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన అశుతోష్ ముఖర్జీ కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కలకత్తా లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెసు వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించాడు. స్వాతంత్రానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడరు. 1949లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకొని అక్టోబర్ 21, 1951 న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మే 23, 1953 న మరణించేవరకు కొనసాగరని అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ రురల్ అధ్యక్షులు కుందూరు కోటిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ధేనుమకొండ రామరాజు, అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ గంధం సతీష్, గుండా గోపి, చింతలపూడి ఉమామహేశ్వరరావు, మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin