సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాష్ట్రోపాధ్యాయ సంఘ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్.టి.యు. ప్రాంతీయ కార్యాలయ ఆవరణ లో సంఘ పతాకాన్ని హుజూర్ నగర్ మండల శాఖ అధ్యక్షులు అత్తి.వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల ప్రమోషన్,బదిలీల షేడ్యూల్ కు ఎటువంటి ఆటంకం కలుగకుండా ప్రభుత్వం నిర్వహించాలని , బడిబాట లో విద్యార్ధుల నమోదు పెంచుటకు, మెరుగైన విద్యను విద్యార్దులకు అందించుటకు ఎస్.టి.యు. కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. నమస్తే ఉపాధ్యాయ పత్రికా సంపాదకీయ సభ్యులు రామిశెట్టి .శ్రీనివాస్ రావు మాట్లాడుతూ “నిజాం ప్రభుత్వ కాలంలో” రిజిస్టర్ కాబడి “జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయ సంఘం” నిరంతరం విద్యాలక్ష్య సాధన ,ఉపాధ్యాయ సంక్షేమం కోసం చరిత్రలో 77 వసంతాలుగా ప్రస్థానం కొనసాగిస్తూ నేడు 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నసంఘం రాష్ట్రోపాధ్యాయ సంఘమని తెలిపారు . రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ముక్కా.మధుసూదన్ రావు బాధ్యతతో పనిచేసి ,హక్కులకై ఉద్యమించే సంఘం ఎస్.టి.యు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కన్వీనర్ ఎం.వెంకటరమణ ,మఠంపల్లి మండల శాఖ ప్ర.కార్యదర్శి తేరాల.వెంకటేశ్వర్లు , హుజూర్ నగర్ ప్ర.కార్యదర్శి కోటగిరి .శివయ్య ,జి.ప.ఉ.పా.పెదవీడు ప్రధానోపాధ్యాయులు కీత. శ్రీనివాస్ రావు , బి.గోవింద్ నాయక్ , వాసిరెడ్డి .అన్నపూర్ణ ,కర్నే. వెంకటేశ్వరరావు, బుడిగె.గోవిందయ్య ,పరిమి .శ్రీనివాస్ కుమార్,ఆర్ .మంజునాద్ ,చింతల .శ్రీనివాస్ , కుప్పాల .రామమూర్తి,చేపూరి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin