Monday, 27 July 2026 05:12:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ మండల కమిటీ ఎంపిక...

Date : 19 June 2023 01:08 AM Views : 519

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న బిసిల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం షాద్ నగర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఫరుక్ నగర్ మండల బీసీ కమిటీని శంకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాలూకా బీసీ సెల్ కన్వీనర్ జాకారం చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎన్నుకున్నట్టు ఆయన ప్రకటించారు. మండల కమిటీ అధ్యక్షుడిగా బసప్ప ఉపాధ్యక్షుడిగా ముకుందం, జగన్నాథం, సత్యం, పూజారి రాములు, ప్రధాన కార్యదర్శిగా అంజయ్య, కార్యదర్శులుగా ఆవ యాదయ్య, రవికుమార్, శివశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రకాంత్, కోశాధికారిగా బాలరాజ్, యాదయ్య, సలహాదారులుగా గున్న వెంకటేష్, భూపాల్ యాదవ్, కుమ్మరి చిన్న రాములు, సింగారం యాదయ్య, చెన్నయ్య రాజులను ఎన్నుకున్నట్టు స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అడుగడుగున అన్యాయం చేస్తుందని అన్నారు. చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో పాటు కేంద్రంలో ప్రత్యేకంగా బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా.. బిసిలకు కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని విన్నవించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బీసీలకు అడగడుగున అన్యాయం చేస్తుందని బిసి బంధు కింద అన్ని వర్గాలకు ఒక లక్ష రూపాయలు ఇవ్వకుండా కేవలం బీసీల్లో కొందరికి మాత్రమె లక్ష రూపాయల బందు ఇస్తున్నారని ఇది తీవ్ర అన్యాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిసిసి నెంబర్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జగదీష్ అప్ప, కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఐఎన్టియుసి రఘు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, నాగి సాయిలు, అందేమోహన్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, ముబారక్ అశోక్, అదే శ్రీకాంత్, నెహ్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :