సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : పేరూరు పీ.ఎస్ పరిధిలోని ధర్మారం, అయ్యవారి పేట గ్రామాల్లో దాడులు నిర్వహించి, గుడుంబా ను స్వదీనః చేసుకున్నారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబాను అరికట్టడంలో భాగంగా పిఎస్ స్టాఫ్ మరియు సిఆర్పిఎఫ్ పార్టీ కలిసి ధర్మవరం మరియు అయ్యవారిపేట గ్రామంలోని ఇండ్లలో సోదా చేయగా కుమ్మరి సూరిబాబు, సఅయ్యవారిపేట, కు చెందిన వ్యక్తి ఇంట్లో 15 లీ. నాటు సారా, గార సారయ్య , చెందిన వ్యక్తి ఇంట్లో 10 లీ.. కుమ్మరి వెంకటలక్ష్మి అయ్యవారిపేట చెందిన వ్యక్తి ఇంట్లో 16 లీ., 4. ముతునూరు సుందరరావు అయ్యవారిపేట, చెందిన వ్యక్తి ఇంట్లో 16 లీ. సారా, జనగం రమణ అయ్యవారిపేట, వాజేడుకు చెందిన వ్యక్తి ఇంట్లో 20 లీ. నాటు సారా, మరియు ముత్తబోయిన సరోజన, ధర్మ వరం, చెందిన వ్యక్తి ఇంట్లో 12 లీ. ప్రభుత్వం నిషేధించబడిన గుడుంబా ని మొత్తం సుమారుగా 89 లీటర్లు సారా స్వదీనం చేసు కొన్నారు. చతిస్గడ్ రాష్ట్రం నుండి తీసుకొని వచ్చి తమ ఇంటి వద్ద అమ్ముతుండగా పట్టుకొని గుడుంబాను సీజ్ చేసి పై వ్యక్తుల మీద కేసులు నమోదు చేశారు. మళ్లీ గుడుంబా అమ్మకుండా అందర్నీ వాజేడు తహసీల్దార్ ముందు రూ.50,000/- పూచికత్తుతో బైండోవర్ చేయడమైనదని పేరూరు ఎస్.ఐ. రమేష్ మీడియా కు తెలిపారు. తిరిగి మళ్ళీ సారా అమ్మినచో రూ.50,000/- వేలు జప్తు చేయడం జరుగుతుంద ని తెలిపారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరైనా ప్రభుత్వం నిషేధించిన గుడుంబాని అమ్మినచో వారి పైన కఠినమైన చర్యలు తీసుకొడం జరుగుతుందని ఎస్.ఐ. జి. రమేష్ హెచ్చరించారు....
-----------------------
Admin