సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ ప్రజలకు అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఎల్లవేళలా వారికి చేదోడు వాదోడుగా ఉంటుందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ఈద్గా వద్ద బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఆయన పలువురు మత పెద్దలతో పాటు ప్రజలను స్వయంగా కలుసుకొని ఈద్ ముబారక్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్యాగాలకు ప్రత్యేకంగా నిలిచే బక్రీద్ పర్వదినం ఎంతో గొప్పదని మహనీయుల అడుగుజాడలలో నడుస్తూ సమాజానికి సర్వమత సందేశం అందజేయాలని అన్నారు. పవిత్ర బక్రీద్ పండగ సందర్భంగా పలు మసీదుల వద్ద మరియు ఈద్గా వద్ద మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ వెంట ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు, పిసిసి సభ్యులు బాబర్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, ఫరక్ నగర్ మండల అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అందేమోహన్, నందిగామ శంకర్, అర్జున్ లక్ష్మణ్, ముబారక్ అలీ ఖాన్, తుపాకుల శేఖర్, నెహ్రు నాయక్, ఇప్పలపల్లి శ్రీనాథ్, లింగారెడ్డి గూడా అశోక్, గంగ ముని సత్తయ్య, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin