సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పోచమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరిపై కలగాలని అమ్మవారిని కోరుకున్నట్టు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు KV రంగా కిరణ్ తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామవరం ఏడవ వార్డు లో నూతన పోచమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా నవధాన్యాలను వేసి నారికెళను సమర్పించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని కమిటీ నిర్వాహకులకు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండల బీజేపీ అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు కమిటీ సభ్యులు ఇల్లందుల దుర్గారావు, కొత్తూరి మదనయ్య, సంజీవ్ కుమార్, చుక్కయ్య, రవి, శంకర్, పెరిక రవి, శివ, హరిబాబు పోచయ్య బీజేపీ నాయకులు చింతలచెరువు శ్రీనివాసరావు జల్లారప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin