సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ ఎమ్మెల్యే పి యు సి చైర్మన్ నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి సమక్షంలో, హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో నందిపేట్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముస్లిం కమిటీ నందిపేట్ మండల అధ్యక్షులు ఖలీంభాయ్, ఆయనతోపాటు 100 మంది కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జీవన్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, జెడ్పిటిసి ఎర్రం ముత్యం, వైస్ ఎంపీపీ దేవేందర్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉల్లి సుధాకర్ గౌడ్, డాక్టర్ హైమద్, హుస్నాద్దిన్, ఎంపీటీసీ బజరంగ్ చవాన్, ఉప సర్పంచ్ భరత్, నందిపేట్ ముస్లిం నాయకులు పాషా,గౌస్, రఫీ కొద్దీన్, వార్డు మెంబర్లు మదర్ బాయ్, రఫీక్, సలీం, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు...
-----------------------
Admin