సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ నియోజక వర్గం ఫరూఖ్ నగర్ మండలం విట్యాల గ్రామం మాజీ సర్పంచ్ అంజయ్య మరియు ప్రస్తుత వార్డు సభ్యులు విష్ణుగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫరూఖ్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి మరియు విట్యాల మాజీ సర్పంచ్ నెహ్రూ మరియు జగన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ కే. అంజయ్య మరియు వార్డ్ నెంబర్ విష్ణు గౌడ్ తో పాటు ఎండి పాషా, రంగంపల్లి నర్సింలు, రామచంద్రయ్య, శేఖర్, కృష్ణయ్య, లింగం, నర్సింలు, లింగం, తిరుపతయ్య, కుమార్, నర్సింలు, మాధవులు, జీ నర్సింలు, ఎం శ్రీశైలం, సహా 50 మంది కార్యకర్తలు వీరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షాద్ నగర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ మరియు జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి మరియు మాజీ ఎంపీపీ బుజ్జిబాబు నాయక్ పాల్గొన్నారు.
-----------------------
Admin