సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నెక్కొండ, (డి కుమార్ రిపోర్టర్ )@@@ నెక్కొండ మండలంలోని కాంగ్రెస్ బాకీ కార్డును బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దొఖా పార్టీ అని తెలంగాణ ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది 22 నెలలు అవుతున్న ఆనాడు చెప్పినటువంటి గ్యారెంటీ కార్డు చూపించి ఫోటోలు దిగి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖం చూపెట్టే పరిస్థితి లేదు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటువంటి ధైర్యం లేని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు అడుతు అనేక మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతుంది గ్రామాల్లో పల్లెల్లో తండాల్లో ముఖం చూప లేని కాంగ్రెస్ పార్టీ వాళ్లు స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబడే ధైర్యం లేదు, ప్రతి గ్రామాల్లో నిలదీసే పరిస్థితి ఉంది* కెసిఆర్ ఆన్నీ పథకాలు ఇచ్చాడు, ప్రజలు అడగకున్న క్యూలైన్ లో నిలబడకుండా ఇంటికి పంపించినటువంటి ఘనత కేసీఆర్ గారిది బిఆర్ఎస్ పార్టీకి దక్కింది కాంగ్రెస్ పార్టీ నయా మోసాలకు పాల్పడుతూ ఆరు గ్యారెంటీలు 420 హామీల పేరు మీద గ్యారెంటీ కార్డుతో కాంగ్రెస్ నాయకులు ముఖం చూపెట్టుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు అభయ హస్తం ముసుగులో ఆనాడు వారు ఇచ్చినటువంటి గ్యారెంటీ ఏదైతే ఉందో ఆ గ్యారెంటీ కార్డులో పొందుపరిచినటువంటి హామీలు దాని యొక్క చెల్లింపులు ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ఇవ్వాల్సినటువంటి బాకీలను ప్రజలకు వివరించాలి.. ఆ బాకీ తో కూడినటువంటి వివరాలను కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది ఎన్నికలు వచ్చినప్పుడు పోల్ చిట్టి ఎలా అయితే ఇస్తారో ప్రతి ఓటరు, ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్న బకాయి కార్డు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది మేము మోసపోయిన కాబట్టి ప్రతికారం తీసుకుంటాం మేము మోసపోయినం కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమాధానం చెప్తామని మహిళలు, యువత, రైతులు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు రైతాంగానికి యూరియా ఇవ్వాలేని దిక్కులేని అలోచానా లేనటువంటి ప్రభుత్వం యూరియా సకాలంలో అందగా పంటలు పాడయినాయి, అధిక వర్షాల వలన పంటలు నల్లబడిపోయినాయి60 శాతం దిగిబడి తగ్గిపోయింది గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ మీద పంటల నష్టం తీవ్రమైన ప్రభావం చూపుతుంది అన్నిటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు సమయం వస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఊరి పొలమేర లోని ఆపి నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు బాకీ కార్డు ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఇంటింటికి చేరాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు,పాక్స్ ఛైర్మెన్లు, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ,పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ బాధ్యలు,మాజీ సర్పచ్ లు, ఎంపిటిసి లు,గ్రామ పార్టీ అధ్యక్షులు,మండల యూత్ నాయకులు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
-----------------------
Reporter