సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పూర్వ వీఆర్ఏలమైన మేము గత ప్రభుత్వము జూలై నెలలో వీఆర్ఏలని రెగ్యులర్ చేసి వివిధ శాఖలలోకి ప్రమోషన్లు ఇచ్చి బదిలీ చేయడం జరిగింది కానీ రెగ్యులరైజ్ అయిన వీఆర్ఏలకు ఎంప్లాయ్ ఐడి జారీ చేయలేదు. దాని మూలంగా గత ఐదు నెలల నుండి వేతనాలు లేక వీఆర్ఏలు ఆర్థిక ఇబ్బందులతోటి చాలా సతమతమవుతున్నారు రాష్ట్రంలో అక్కడక్కడ కుటుంబ పోషణ చేసుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందు మేము ఏ ధర్నా చేసినా కూడా పూర్తి మద్దతు ప్రకటించి మేము అధికారంలోకి రాగానే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏ ఆదుకొని ఎంప్లాయ్ ఐడి అందించాలని వీఆర్ఏ లు హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో గల ఏడు మండలాల వీఆర్ఏలు అదే విధంగా రెండు మున్సిపాలిటీలలో పనిచేస్తున్న వార్డ్ ఆఫీసర్లు అందరు కలిసి రెవిన్యూ డివిజనల్ అధికారి కి వినతి పత్రం అదే విధంగా ధర్నా చేయడం జరిగింది మా యొక్క సమస్యని ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని వీఆర్ఏల నేతలు వేడుకున్నారు విన్నవించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో లక్ష్మల్ల నరసింహ మోర్య వీఆర్ఏ హక్కుల సాధన సమితి రాష్ట్ర కో చైర్మన్ పాల్గొనడం జరిగింది రెవెన్యూ డివిజనల్ అధ్యక్షులు చింతమల్ల కోటయ్య నాగు జనరల్ సెక్రెటరీ కార్ల ఆధ్వర్యంలో సుమారు 100 మంది తోటి ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మొత్తం ఏడు మండలాల వీఆర్ఏలు రెండు మున్సిపాలిటీలో పనిచేస్తున్న వార్డ్ ఆఫీసర్ వీఆర్ఏలు ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేశారు...
-----------------------
Admin