సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం దుగ్గొండి మండల ఉపాధ్యక్షుడు చొప్పరి భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గ్రామ నూతన కమిటీని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్ ల సమక్షంలో మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్ గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నన్నె రాజు, ఉపాధ్యక్షులుగా కరట్లపెల్లి అరవింద్, మురహరి రాంబాబు, పాలడుగుల రాజేందర్, మోటం రాజు, కార్యదర్శులుగా రేగుల రవి, పొన్నం రాంబాబు, ఎద్దు రమేష్ లను ఎన్నుకున్నారు.
-----------------------
Reporter