సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్నగర్ : క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ అని అనుకున్న సమయానికి రాకున్నా పెద్ద ఎత్తున నాకోసం వేచి ఉండడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కితాబు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పార్లమెంటు ఎన్నికలలో అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ తనకు మద్దతు ఇచ్చి గెలిపించిందని ఈసారి కూడా తన గెలుపులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అన్ని విధాలుగా సహకరిస్తానని మా కార్యకర్తల వలె కంటికి రెప్పలా చూసుకుంటానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ పట్టణ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొమ్మ గాని వెంకటేశ్వర్లు గౌడ్ మీసాల సైదులు గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కీసరి నాగయ్య ముదిరాజ్ గుండు వెంకటేశ్వర్లు గౌడ్ హుజూర్ నగర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కష్టాల కనకరత్నం తురక గోపి ఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోశపతి బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి చల్లా వంశీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కె మస్తాన్ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి భానోతు లక్ష్మ హుజూర్ నగర్ పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు చంద్రగిరి సాంబ చింతలపాలెం మండల పార్టీ అధ్యక్షులు మేకల రామారావు యాదవ్ పాలకీడు మండల పార్టీ అధ్యక్షులు అమరయ్య మేళ్లచెరువు మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు మఠంపల్లి మండల ప్రధాన కార్యదర్శి హుస్సేన్ రాష్ట్ర కార్యదర్శి జానకిరామ్ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి బాలాజీ నాయక్ హుజూర్ నగర్ పట్టణ గౌరవ అధ్యక్షులు తమ్మిశెట్టి రాములు మండల అధికార ప్రతినిధి మర్రి రాములు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇడుపుగంటి సుబ్బారావు వెంకటేశ్వర్లు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు
-----------------------
Admin