సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో పుల్లలచెరువు మండలం టిడిపి మండల కన్వీనర్ పయ్యావుల ప్రసాద్ మాట్లాడుతూ. ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుపై అసత్య ప్రచారాలు ఇసుక మాఫియా. రేషన్ దందా అధికారులు బెదిరించి డబ్బులు వసూలు చేసిన నాడు ఎన్నో ఎన్నో అబద్ధపు మాటలు మాట్లాడడమే కాక మా టిడిపి నాయకుల పైన ఎన్నో నిరాధారమైన ప్రచారాలు చేయటం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ అది తగదని హేతువు పలికాడు. వారానికి ఒకసారి వచ్చే వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ నోరు అదుపులో పెట్టుకోవాలని మీకు దమ్ముంటే మా అక్రమాలు నిరూపించాలని అని సవాల్ విసిరాడు ఇంకొక్కసారి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు మాట్లాడితే చట్టపరంగా మీ పైన మీ వైసీపీ నాయకుల పైన ఎంక్వయిరీ చేస్తాము మీ మోసాలను నిరూపిస్తామని పయ్యావుల ప్రసాద్ ఉన్నారు. అంతేకాదు చేపల మడుగు సర్పంచి సత్తిరెడ్డి ఖబడ్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నీవు చేసిన మోసాలు అక్రమాలు భూ దందాలు అన్ని మాకు తెలుసు మీది దొంగల పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ దొంగ నాయకులను పక్కన పెట్టుకొని ఏవేవో అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు ఆ మాటలు నీ స్థాయికి తగినవి కాదు అని వారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కాకర్ల కోటయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin