సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలపై సమగ్ర సర్వే నిర్వహించి జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా జిల్లా కలెక్టరును కోరారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఆమెను కలిసి వినతిపత్రాన్ని అందించి సమస్యను వివరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి, వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేసిన గిరిజన, గిరిజనేతర పేద రైతులు గుండె నిబ్బరం కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసి జరిగిన నష్టంపై సర్వే చేపట్టి తగు నివేదికని ప్రభుత్వానికి అందించడం ద్వారా నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చొరవ తీసుకోవాలని కలెక్టరును కోరినట్లు సాబీర్ పాషా తెలిపారు.
-----------------------
Admin