సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని భారతీయ జనతా పార్టీ జాతీయ మరియు రాష్ట్ర నాయకత్వo ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ధ్యగ ఉదయ్ ఆధ్వర్యంలో నేను జన్మించిన నేల - నన్ను జన్మించిన దేశం " మేరీ మట్టి- మేరా దేశ్ " కార్యక్రమాన్ని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జమ్మన్ జెట్టి గల్లీలో నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలో పురస్కరించుకొని ప్రతి ఇంటికి వెళ్లి కలశంలో పిడికెడు మట్టిని లేదా పిడికెడు బియ్యాన్ని తీసుకొని కలశం తో కూడిన ఈ మట్టి ఢిల్లీలో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం వద్ద తీసుకువెళ్లి అక్కడ అమరవీరుల యొక్క ప్రాంగణంలో దేశవ్యాప్తంగా సేకరించినటువంటి మట్టి పోసి మొక్కలు నాటి అమృత వనాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు.
-----------------------
Admin