సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : నారాయణపేట జిల్లా కేంద్రంలో నేడు [17-04-2023] జరుగు అంబేద్కర్ జాతరను విజయవంతం చేయాలని కానుకుర్తి అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఖాశీం ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగం పై దాడి పెరిగిందన్నారు. రాజ్యాంగం కాపాడుకోవడం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జాతర ప్రచార కార్యదర్శి యం,అశప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మోహన్, వార్డు మెంబర్ అశోక్, అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షుడు బి,మాహేష్, ప్రధాన కార్యదర్శి అశోక్, సాయిరాం,లాలప్ప,ఉసేనప్ప, సురేష్, రమేష్, అనిల్, అంజి, మల్లేష్, హనుమంతు, రమేష్ వెంకటప్ప,శరణప్ప, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin