సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : భారత ప్రజల స్వేచ్ఛకు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ప్రతీ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటామని హుజూర్ నగర్ ఎస్ఐ ముత్తయ్య అన్నారు. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ వేడుకలో ఎస్ఐ ముత్తయ్య మాట్లాడుతూ...నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో అమరుల త్యాగాల ఫలితమని గుర్తు చేశారు. ఆగస్టు 15,1947 భారత స్వాతంత్ర్య చట్టం అమలులోకి వచ్చిందని బ్రిటీష్ సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ భారత దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికి స్వతంత్ర భారతావనిగా వెలసిన చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు భారత దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఎస్ఐ ముత్తయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జెండా వందన కార్యక్రమంలో ఏ ఎస్ ఐ లు బలరాం రెడ్డి, రమేష్,హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్ రెడ్డి, రాముల్ నాయక్,హరి నారాయణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin