సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి పట్టణం నందు నిర్వహించుచున్న శ్రీ సత్య సాయి బాబా 97వ జయంతి వేడుకలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ గారు తెలియజేశారు. దేశ విదేశాల నుండి వచ్చు సత్యసాయిబాబా భక్తులకు ఎక్కడ కూడా ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, నగరం లోని ప్రజలకు కూడా ఏక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఈ వేడుకలకు వివిధ ప్రముఖులు హాజరవుతున్న సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండే విధంగా ప్రతిష్ట బందోబస్తును ఎర్పాటు చేశారు. బందోబస్తులో భాగంగా ఇద్దరు డిఎస్పీలు, 12 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 90 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబులు, 250 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 30 మంది మహిళా కానిస్టేబుల్స్, 80 మంది హోంగార్డులు, నాలుగు స్పెషల్ పార్టీ బృందాలను సిద్దం చేశారు....
-----------------------
Admin