సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ : కేంద్ర ప్రభుత్వం 2016లో వికలాంగుల రక్షణ కోసం తీసుకువచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 ను సమర్థవంతంగా అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కోదాడ నూతన డీ ఎస్ పి నియమితులైన ప్రకాష్ యాదవ్ కి విజ్ఞప్తి చేశారు . సంఘం నేతలతో కలిసి నూతన డీ ఎస్ పి బాధ్యతలు స్వీకరించిన ప్రకాష్ యాదవ్ ని శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపి అనంతరం వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నూతన డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా సమాజంలో వివక్షకు గురి అవుతూ ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కొంటున్న వికలాంగుల సామాజిక వర్గానికి అండగా నిలబడాలని వికలాంగుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పరిష్ఠమైన చట్టాలు తెచ్చిన రాష్ట్రంలో వికలాంగులపై రోజు రోజు కు దాడులు ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని అభం శుభం తెలియని మానసిక వికలాంగురాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయని రాష్ట్రంలో గౌరవప్రదమైన ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్న సర్పంచ్ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రజా ప్రతినిధులు వికలాంగులను వైకల్యం పేరుతో దూషించడం దాడులకు పాల్పడుతుండటం తమ వికలాంగుల సమాజానికి ఎంతో బాధిస్తుందని డీఎస్పీ కి తెలియజేసి వికలాంగుల రక్షణ కోసం ఉన్న వికలాంగుల హక్కుల చట్టం- 2016 సెక్షన్ 91,92 ల గురించి మీ పరిధిలో ఉన్న స్టేషన్లలో అవగాహన కల్పించి చట్టం సమర్థవంతంగా అమలయ్యే విధంగా కృషి చేయాలని డి.ఎస్.పి కి గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేసి ఇటీవల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కుర్ర గోపి యాదవ్ ను నూతన డిఎస్పీ కి పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కొల్లూరి ఈదయ్య ,బాబు సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్ సంఘం మునగాల మండల నాయకులు గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి సంఘం జిల్లా నాయకులు పిల్లుట్ల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin