Sunday, 26 July 2026 10:01:08 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎంపీపీ పార్వతి కొండా నాయక్ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం...

Date : 29 June 2023 01:19 AM Views : 473

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి సూచనల మేరకు ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్ అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశ కార్యక్రమంలో అన్నీ శాఖల అధికారులతో ఎంపీపీ పార్వతి కొండా నాయక్ మాట్లాడి మఠం పల్లి మండలం లోని ప్రజలు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.ముఖ్యంగా వచ్చేది వానాకాలం సీజన్ కాబట్టి రైతులకు విత్తనాలు,ఎరువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మొన్న జరిగినటువంటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించినటువంటి నాయకులను, అధికారులను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వానాకాలం కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి రైతులకు రైతు బంధు ,రైతు బీమా, గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఈనెల 30వ తారీఖున ఇస్తున్నందున గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జగన్ నాయక్ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి , ఎంపీడీవో జానకి రాములు, ఎమ్మార్వో సాయ గౌడ్, ఎంఈఓ ఛత్రు నాయక్ , వెటర్నరీ డాక్టర్ ,, ఏపీవో ఉమా, ఏపిఎం సౌజన్య,సర్పంచులు లక్ష్మీ నరసింహ రాజు, జోజప్ప , గోవిందు, ఎంపీటీసీలు నరసింహారావు, నాగిరెడ్డి, సైదా కుమారి కాశయ్య, సైదమ్మ,కార్యదర్శులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :