సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి సూచనల మేరకు ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్ అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశ కార్యక్రమంలో అన్నీ శాఖల అధికారులతో ఎంపీపీ పార్వతి కొండా నాయక్ మాట్లాడి మఠం పల్లి మండలం లోని ప్రజలు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.ముఖ్యంగా వచ్చేది వానాకాలం సీజన్ కాబట్టి రైతులకు విత్తనాలు,ఎరువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మొన్న జరిగినటువంటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించినటువంటి నాయకులను, అధికారులను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వానాకాలం కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి రైతులకు రైతు బంధు ,రైతు బీమా, గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఈనెల 30వ తారీఖున ఇస్తున్నందున గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జగన్ నాయక్ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి , ఎంపీడీవో జానకి రాములు, ఎమ్మార్వో సాయ గౌడ్, ఎంఈఓ ఛత్రు నాయక్ , వెటర్నరీ డాక్టర్ ,, ఏపీవో ఉమా, ఏపిఎం సౌజన్య,సర్పంచులు లక్ష్మీ నరసింహ రాజు, జోజప్ప , గోవిందు, ఎంపీటీసీలు నరసింహారావు, నాగిరెడ్డి, సైదా కుమారి కాశయ్య, సైదమ్మ,కార్యదర్శులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
-----------------------
Admin