Sunday, 26 July 2026 08:12:20 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కానిస్టేబుల్ మృతికి కేటీఆర్ బాధ్యత వహించాలి... - టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు

Date : 02 October 2023 05:50 AM Views : 208

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఐటిశాఖ మంత్రి కేటీఆర్ భద్రాద్రి జిల్లా పర్యటన నేపథ్యంలో భద్రాచలం పర్యటన సమయంలో విధి నిర్వహణ కోసం వచ్చిన కొత్తగూడెం 1టౌన్ కానిస్టేబుల్ శ్రీదేవి మరణం పట్ల ఓబీసీ డిక్లరేషన్ కమిటీ సభ్యులు, టీపీసీసీ కమిటీ సభ్యులు నాగా సీతారాములు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మహిళా కానిస్టేబుల్ మృతి బాధాకరమని, కానిస్టేబుల్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కానిస్టేబుల్ మృతికి కేటీఆర్ బాధ్యత వహించాలని ఓబిసి డిక్లరేషన్ కమిటీ సభ్యులు టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు డిమాండ్ చేశారు. వర్షాకాలం వస్తే భద్రాచలం ప్రజలు, రాముడి భక్తులు పడుతున్న ఇబ్బందులు తెలిసినప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోక పోవడమే కానిస్టేబుల్ శ్రీదేవి మృతికి కారణమని కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ వారే గుసగుసలాడుకోవడంలో నిజమెంతో అధికారులు ఆరా తీయాలని అయన డిమాండ్ చేశారు. అటు వినాయక చవితి నిమజ్జన వేడుకల వల్ల తీవ్రంగా అలసిపోయిన పోలీస్ లను మంత్రి పర్యటన పేరుతో ఇబ్బంది పెట్టారని వస్తున్న ఆరోపణల పట్ల కూడ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. భద్రాచలం పట్టణానికి ఉన్న ప్రధాన సమస్య డ్రైనేజి అని దాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, భద్రాచలం పట్టణాన్ని అటు పంచాయతీ ఇటు మున్సిపాలిటీ కాకుండా ఉంచి అధికారుల చేతిలో ఉంచడం వల్లే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదన్నారు. కానిస్టేబుల్ శ్రీదేవి మృతికి పూర్తి భాద్యత ఐటీశాఖ మంత్రి కేటీఆర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు భాద్యత వహించాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తానని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :