సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్లో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ అసెంబ్లీ నాయకులు పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. వారు ప్రజలకు వివరిస్తూ బిజెపి ప్రపంచంలోనే రాజకీయ పార్టీలలో గొప్ప పార్టీ అని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం దేశ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని ప్రపంచ దేశాలు సైతం కొనియాడే విధంగా కృషి చేస్తున్నానన్నారు. దీనికి నిదర్శనంమొన్నటికి మొన్న అమెరికాలో కాంగ్రెస్ హౌస్ లో జరిగినటువంటి సంఘటనే నిదర్శనం అన్నారు. అంతేకాకుండా భారత దేశ భారతదేశ ప్రధానులలో ఏప్రధాని ఈజిప్టుకు వెళ్లలేదని ఈజిప్టు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడ అత్యున్నతమైన పురస్కారాన్ని ఇవ్వడం 140 కోట్ల భారతీయులకు గర్వకారణం అన్నారు. కావున ప్రజలు మరోసారి భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీని భారతదేశ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి గగులోత్,తిరుపతి నాయక్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పసుపుల సాయికుమార్, ఉపాధ్యక్షులు సాయినాథ్ రెడ్డి,పెరంబదుర్ వాసు, పరశురాం గౌడ్, పశువుల శంకర్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin