Monday, 27 July 2026 07:39:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మున్నేరు పై తెగల వంతెనకు EPC టెండర్ కొరకు GO జారీ

Date : 09 March 2023 04:41 PM Views : 669

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం ప్రజల తరుపున సిఎం కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ..... హైదరాబాద్ తరువాత అంతటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగర సిగలో మరో మణిహారం అయిన మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం GO ను విడుదల చేసింది.ఖమ్మం మున్నేరుపై రూ.180 కోట్లతో నిర్మించనున్న తీగల వంతెన కు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం EPC టెండర్ ను ఖరారు చేస్తూ జీఓ నెం.90 ను జారీ చేసింది. ఇందుకు గాను ఆయా టెండర్ ను అప్రూవ్ చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కన్వీనర్ గా పి రవీందర్ రెడ్డి EnC (R&B), కో కన్వీనర్ గా గణపతి రెడ్డి ENC (R&B), సభ్యులు గా P సతీష్ CE (R&B), P మధుసుధన్ రెడ్డి CE (R&B), లను నియమించింది.మొత్తం 420 మీటర్ల పొడవైన ఈ బిడ్జి నిర్మాణంలో 300మీటర్ల తీగల వంతెన ఉంటుందని, హైదరాబాద్‌లోని దుర్గంచెరువు తీగల వంతెన నమూనాలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరగబోతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.హైదరాబాద్‌ దుర్గంచెరువుపై నిర్మించిన హైలెవల్‌ తీగల వంతెన తరహాలో ఖమ్మం మున్నేటిపైనా కొత్త వంతెన నిర్మాణ పనుల ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుందన్నారు. నిర్మాణ పనులకు గాను ఆయా టెండర్ కొరకు GO ను జారీ చేయడం పట్ల ఖమ్మం ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఅర్ కి మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :