సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : శుభకార్యానికి వెళ్తుండగా సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఎల్ గోవిందాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు పయనమయ్యారు. విజయవాడ సమీపంలో ఉన్న గుణదలలోని టెంపుల్ లో చిన్నారికి చెవులు కుట్టించేందుకు బయలుదేరారు. కారులో మొత్తం పది మంది ప్రయాణిస్తున్నారు. కోదాడ పట్టణ సమీపంలోని దుర్గాపురంలో అప్పటికే బ్రేక్ డౌన్ అయి లారీ ఆగిపోయింది. దీన్ని గమనించని కారు వేగంగా వచ్చి, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు ఘటనాస్థంలోనే చనిపోగా, గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
-----------------------
Admin