సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తూర్పాటి రామ్ మురారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 27వ తేదీన శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు-వివిధ రంగస్థల కళా ప్రదర్శనల కార్యక్రమంలో పాల్గొని తిరుమలరాయ పాత్రను అద్భుతంగా ప్రదర్శించినందుకు గాను బాలరత్న-2023 అంతర్జాతీయ పురస్కారం పొందాడని ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి జయవాణి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థి అంతర్జాతీయ పురస్కారాన్ని పొందడం ఆనందంగా ఉందని, విద్యార్థులు విద్యతో పాటుగా,తమకు నచ్చిన కళలలో కూడా ప్రావీణ్యం సాధించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, శ్రీదేవి,ప్రభాకర్ రావు,విజయలక్ష్మి దీనారాణి,శైలజశేషగిరి,అన్వేష్,వసంతరావు జనార్ధన్ రెడ్డి,రవీందర్ రెడ్డి అరుణరాణి,అశోక నాగేశ్వరరావు,శ్రీకాంత్,శేఖర్,మున్ని పాల్గొన్నారు.
-----------------------
Admin