సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సారపాక : గత ఎనిమిది రోజులుగా పంచాయతీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు సారపాక బస్ స్టాండ్ ఎదుట పంచాయతీ కార్మికులు గత 11 రోజులుగా చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు తెలియజేస్తూ వారు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా పారిశుద్ధ కార్మికులు పంచాయతీ లలో గ్రామాలను ,కాలువలను శుభ్రపరుస్తూ ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యాలను పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని కనీస వేతన అమలు చేయకుండా, కేవలం 9000 రూపాయల జీతంతోటి జీవనo సాగిస్తున్నారని వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు చట్టసభల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ,ఎంపీ ప్రజాప్రతినిధులకు వారి జీతభత్యాలు పెంచుకుంటున్నటువంటి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాల కోసం పనిచేసే పంచాయతీ కార్మికుల గురించి ఎందుకు పట్టించుకోవడంలేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగితే కార్మికుల సమస్యలే ఉండవని ,ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం రాదని చెప్పిన కేసీఆర్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే ఆ సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, ఐ ఎన్ టి యు సి నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కనితి కృష్ణ, మాజీ జెడ్పిటిసి బట్ట విజయ గాంధీ, కాటబోయిన నాగేశ్వరరావు, నియోజకవర్గ యువజన అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసు రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతు రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కాటం వెంకట్ రామ్ రెడ్డి, బిజ్జం వెంకటేశ్వర రెడ్డి, మైనార్టీ మండల అధ్యక్షుడు మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin