Monday, 27 July 2026 02:26:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హులైన ప్రతీ గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందే విధంగా...

Date : 13 December 2022 01:09 AM Views : 447

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం పట్టణంలో సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అధికారిక పనులపై వెళ్లినందున గిరిజన దర్బార్లో అర్జీలు సమర్పించడానికి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన గిరిజన లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా విడుదల అయ్యే సంక్షేమ పథకాలు త్వరితగతిన అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఎక్కువ శాతం దరఖాస్తులు పోడు భూముల సమస్యలు , వ్యక్తిగత సమస్యలు , గురుకుల పాఠశాలలోని సీట్ల మార్పిడి కొరకు , సబ్సిడీ ద్వారా అందుతున్న ట్రైకర్ రుణాల కొరకు , వ్యవసాయానికి సంబంధించిన కరెంటు మోటార్లు , బోరు బావుల గురించి , స్వయం ఉపాధి పథకం ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థికపరమైన రుణాల కొరకు , చేపల చెరువులకు సంబంధించిన సొసైటీల ఏర్పాటు కొరకు మరియు కిరణా షాపులు , జనరల్ స్టోర్లు , గేదెలు కొనుగోలు చేయడానికి దానికి సంబంధించిన రుణాల కొరకు అలాగే పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం కొరకు , దీర్ఘకాలిక రోగాలకు సంబంధించి వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం కొరకు , పంట భూములలో కరెంటు మోటార్ కి సంబంధించిన కరెంట్ మీటర్ల కొరకు , మారుమూల గ్రామాలలోని గిరిజనులు ఇండ్ల స్థలాల కొరకు భూమి ఇప్పించుట కొరకు , సంబంధిత అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారని వాటిని ప్రత్యేకమైన రిజిస్టర్లులో నమోదు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి విడతలవారీగా వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.ఉద్యోగాల కొరకు ఎవరు గిరిజన దర్బార్ లో దరఖాస్తులు సమర్పించకూడదని ప్రభుత్వం ద్వారా ఉద్యోగ ప్రకటన వెలువడిన వెంటనే సంబంధిత శాఖల ద్వారా అర్హులైన నిరుద్యోగులకు వారి యొక్క అర్హతను బట్టి ఉద్యోగాలను భర్తీ చేస్తారని కానీ గిరిజన దర్బార్లో మాత్రం ఎవరు ఉద్యోగాల కొరకు దరఖాస్తు లను సమర్పించకూడదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్ బాబు , ఏడి అగ్రికల్చర్ భాస్కరన్ , ఐటిడిఏ మేనేజర్ ఆదినారాయణ , డీఎస్ఓ ప్రభాకర్ రావు , గురుకులం ఏవో నరేందర్ , డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఏవో ప్రమీల భాయ్ , వైద్యం , ఇంజనీరింగ్ , ఎస్ డి సి , విద్యుత్ విభాగాల నుండి దుర్గయ్య , వెంకటేశ్వర్లు , నాగభూషణం , చలపతి ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :